మన్యం టీవీ, అశ్వాపురం:బట్టా మల్లయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అశ్వాపురం మండల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ క్రీడా ప్రాంగణంలో పినపాక నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను బట్టా మల్లయ్య మెమోరియల్ ట్రస్ట్ డైరెక్టర్ , బూర్గంపాడు మండల మాజీ జడ్పిటిసి సభ్యుడు బట్టా విజయ్ గాంధీ సామాజికవేత్త బుద్ధరాజు.నవీన్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ సీనియర్ నాయకులు గాదె కేశవ రెడ్డి, అశ్వాపురం పీఏసీఎస్ డైరెక్టర్ ఓరుగంటి బిక్షమయ్య , ట్రస్ట్ సెక్రెటరీ తాటి సత్యనారాయణ, బుర్ర భద్రయ్య , మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాల్వ సంసోను, సహాయ కార్యదర్శి మేకల భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ గాంధీ మాట్లాడుతూ అమ్మ గారి పల్లి పంచాయతీ కి మా నాన్నగారు మల్లయ్య రెండు పర్యాయాలు సర్పంచ్ గా పని చేశారని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, మంచి నాయకుడిగా గుర్తింపు పొందారని వారి సేవలకు గుర్తింపుగా ట్రస్ట్ నెలకొల్పి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేశారు. క్రీడాకారులు క్రీడా స్పూర్తితో, స్నేహభావంతో పోటీలను విజయవంతం చేయాలని కోరారు.
Post A Comment: