👉 పని విషయం లో పంచాయితీ సెక్రెటరీ వేదిపులు
👉 మాకు నిర్దిష్ట పని సమయం కేటాయించాలి,పనికి తగ్గ వేతనం చెల్లించాలి.
మన్యం టీవి,ములకలపల్లి మండలం: మాదారం గ్రామం పంచాయతీ కార్మికులు మరియు వన సేవకులు మాదారం పంచాయతీ సెక్రెటరీ వేధింపులు ఉద్యోగ విషయంలో కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేసి బ్లీచింగ్ చల్లి వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయక ప్రజల ఆరోగ్యమే ద్యేయంగా పనిచేసిన కార్మికులపై కరోనా వచ్చిన సిబ్బందికి సెలవులు ఇవ్వక వారి వేతనాలు కోసిన సందర్భంగా సిబ్బంది వారిని అడగగా నేను ఇలానే చేస్తాను మీరు ఎవరికైనా చెప్పుకోండి అంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నందుకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో మాదారం గ్రామ పంచాయతీ సర్పంచ్ కి మెమోరాండం ఇవ్వడం అయినది.అయిన సెక్రెటరీ ధోరణి లో మార్పు రాకపోవడం వల్ల చివరకు కార్మికులు టెంట్ కింద దీక్షలు చేయడానికి సిద్ధపడి టెంట్ లో దీక్షలు చేస్తున్నారు కావున మిగతా గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు వన సేవకులు మా సమస్యలపై స్పందించి మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈకార్యక్రమంలో సి ఐ టి యు మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు మరియు గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: