మన్యం టీవీ మణుగూరు: తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐల్లో ప్రవేశాల కోసం ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ డైరెక్టర్ కేవై నాయక్ ఆదేశాల మేరకు మూడవ విడత ధరఖాస్తుల గడువు పొడిగించినట్లు జిల్లా కన్వీనర్, మణుగూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ బడుగు ప్రభాకర్ తెలిపారు.శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐలలో 2021 ఆర్ధిక సంవత్సరంలోని మిగిలన సీట్లకోసం 3వ విడత ప్రవేశాల కోసం నవంబర్ 10వరకు ధరఖాస్తుల ఆహ్వానం కోసం గడువు పొడిగించినట్లు తెలిపారు.అర్హత ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.తమ ఒరిజినల్ దృవపత్రాలను ఆన్లైన్ లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నారు.రాష్ట్రంలోని అన్ని ఐటీఐలకు కేవలం ఒక్క ధరఖాస్తు మాత్రమే చేయాలన్నారు.మీకు ఇచ్చిన ఆఫ్షన్స్ లో ఎన్ని ఐటీఐలకు ఎన్ని కోర్సులకైనా ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా సీట్ తప్పకుండా పొందే అవకాశం ఉంటుందన్నారు.https://ti telangana.gov.in వెబ్ సైట్ లో తమ ధరఖాస్తులను ఆన్లైన్ చేసుకోవాలని తెలిపారు.పూర్తి వివరాలకు 9440206990కు సంప్రదించాలని తెలిపారు.
Post A Comment: