మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం గ్రామపంచాయతీలో ట్రైకార్ లోన్స్ దరఖాస్తుదారులకు శుక్రవారం సంబంధిత అధికారులు ఇంటర్వ్యూ నిర్వహించారు. గ్రామం నుండి మొత్తం 50 మంది వివిధ యూనిట్లకు దరఖాస్తు చేసుకోగా, 27 మంది ఇంటర్వ్యూలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో వారు దరఖాస్తు చేసుకున్న యూనిట్ మీద వారికున్న అవగాహన, ఎక్స్పీరియన్స్, వారి ఆర్థిక పరిస్థితి, కుటుంబ వివరాలు తదితర అంశాలను హాజరైన దరఖాస్తుదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్రం మోహన్ రావు, ఎండిఓ చంద్రశేఖర్, ట్రైకార్ లోన్స్ ఐటీడీఏ ప్రతినిధి హరికృష్ణ, మండల సమాఖ్య అధ్యక్షురాలు ఊకం వాణి, గ్రామ కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: