చంద్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:
వెంగళరావు ప్రాజెక్టు లో 2,38,500 చేప పిల్లలను విడిచిపెట్టడం జరిగినదని గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పాండ్ల లక్ష్మయ్య తెలిపారు. శుక్రవారం సీతయిగూడెం గ్రామంలోని వెంగళరావు ప్రాజెక్టులోకి మత్స్యశాఖ ఆధ్వర్యంలో చెప పిల్లలు పంపిణీ ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....... మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేతి వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం చేపడుతున్న చేప పిల్లల పంపిణీ సత్ఫలితాలు ఇస్తుందన్నారు. ప్రతి సంవత్సరం పంచటం వల్ల ఆర్థికంగా తోడ్పాటు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం బాధ్యులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, కీసరి భద్రయ్య, ఫీల్డ్ ఆఫీసర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: