గుండాల అక్టోబర్ 31 (మన్యం మనుగడ) నవంబర్ ఒకటో తారీకు నుండి తొమ్మిదో తారీఖు వరకు జరుగు అమరవీరుల వర్ధంతి సభలను జయప్రదం చేయాలని న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు శంకరన్న పిలుపునిచ్చారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూమి, ముక్తి విముక్తి కోసం పోరాటం చేసి ఎందరో నాయకులు అమరులయ్యారు అన్నారు. చార్ మజుందార్, దొడ్డి కొమురయ్య లాంటి ఎందరో మహనీయులు తమ విలువైన ప్రాణాలను ఉద్యమానికి అంకితం చేశారన్నారు. అలాంటి మహనీయుల వర్ధంతి సభలను ప్రతి ఒక్కరు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ సం చంద్రన్న , కోరం శాంతయ్య , బి వెంకన్న , సమ్మయ్య , వెంకటేశ్వర్లు పాల్గొన్నారు
Navigation
Post A Comment: