మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటురునాగారం ఐటీడిఏ పరిధిలో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ మరియు ఇంఛార్జి ఐటిడిఏ పి. ఓ.,ఎస్.కృష్ణ ఆదిత్య ఐటిడిఎ పరిధిలో పెండింగ్ ఫైల్స్,ఇ ఫైలింగ్,ఆన్లైన్ అటెండెన్స్ మరియు తదితర అంశాల మైన సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రొజెక్టర్ సహాయంతో ఇ ఫైలింగ్ విధానంలో ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు.ఈ ఫైలింగ్ చేసేముందు పూర్తి వివరాలతో సమర్పించాలని ఆదేశించారు. స్కూల్స్ లో టీచర్ పోస్ట్ ల వేకెన్సి మరియు స్కూల్లో స్త్రింత్ టీచర్ పోస్టుల గురించి మాట్లాడారు.హాస్టల్స్ లో పిల్లలకి సరియైన బోజన సదుపాయాలు కల్పిస్తూ,పౌష్ఠిక ఆహారం లో న్యూట్రిషన్ అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో టీచర్ పోస్టుల విషయంలో వెకెన్సి లేకుండా చూడాలని, పిల్లలకి ఇబ్బందీ లేకుండా చూడాలని కలెక్టర్ అన్నారు.
ఒక్క టీచర్ చనిపోతే వారికి రావలసిన బెనిఫిట్స్ అందాయ లేదా అనేది సంబంధిత అధికారులు బాధ్యత తీసుకోవాలని,త్వరిత ప్రభుత్వం నుండి అందవలసిన బకాయిలు అందేలా చూడాలని అన్నారు.ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో అత్యవసరం నిమిత్తం పేషెట్స్ ఎంజీఎం లో బెడ్ ఏర్పాటు మరియు అంబులెన్స్ సేవలు అందించాలని, పేషెంట్ ఇబ్బందీ లేకుండా చూడాలని కలెక్టర్ అన్నారు.అలాగే పి హెచ్ సి లలో అంబులెన్స్ సౌకర్యం కలదు అను బోర్డు కూడా ఏర్పాటు చేయాలని సంబంధిత డిప్యూటీ డిఎంహెచ్ఓ డా.వెంకటేశ్వర్లు ను, ప్రోగ్రాం ఆఫీసర్ మహెదర్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు,ఏవో దామోదర్ స్వామి,ట్రైబల్ వెల్ఫేర్ డిడి ఎర్రయ్య,అర్సివో రాజ్యలక్ష్మి,జీ సిసి మేనేజర్ దేవ్,మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: