CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బేతళపాడు గ్రామ పంచాయతీ లో ఐసిఎంఆర్ జాతీయ పోషకాహార సంస్థ బృందం క్షత్రస్ధాయి పరిశీలన...

Share it:




మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 26, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధి లోని బేతళపాడు గ్రామపంచాయతీ శివారు పంతుల్ తండా, పీక్లా తండా, టాక్యా తండా లలో  ఇటివాల కిడ్నీ వ్యాధితో ప్రజలు ఇబ్బంది పడుతున్నరన్న వరస కథనాలతో కదిలిన హైదరాబాద్ ఐసిఎంఆర్ జాతీయ పోషకాహార బృందం డిప్యూటీ డైరెక్టర్, సైంటీస్ట్, డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం   క్షేత్రస్థాయిలో పరీశీలించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ..ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధి తో బాధపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. బాధితుల నుండి వారి ఆహారపు అలవాట్లు, మూత్ర పరీక్ష, త్రాగు నీటి నమూనాలు, రక్త నమూనాలు, సేకరించి అధ్యయనం చేయడం ద్వారా వ్యాధికి సంబంధించిన మూలాలను కనుగొనే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ ప్రాంతంలో పిల్లల్లో అదేవిధంగా 17 సంవత్సరాల లోపు బాలికలలో పోషకాహార లోపం ఉన్నట్లు గుర్తించామని అన్నారు. ఈ ప్రాంతంలో వీరు పండించే పంట పొలాలకు అధికంగా ఫెర్టిలైజర్,& పెస్టిసైడ్స్ వాడకం వల్ల ఆహారం మరియు నీరు కలుషితమై ప్రజల ఆరోగ్యం పై ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ వీరబాబు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: