మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జానంపేట గ్రామంలో రైతు వేదికలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోర్స అభిమన్యుడు పంట మార్పిడి విధానం పై రైతులకు సలహలు ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమం వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు గురించి పూర్తి అవగాహన కల్పించారు. యాసంగిలో ప్రభుత్వ ఆదేశానుసారంగా వరి పంట సాగు విస్తీర్ణం తగ్గించి అపరాలు, నూని గింజలు, కురగాయలు, ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలని . ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ , ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, మణుగూరు సహాయ వ్యవసాయ సంచాలకులు తాతారావు , మండల వ్యవసాయ శాఖ అధికారి వేంకటేశ్వర్లు , వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు కేశవ్ రావు , కొమరం లక్ష్మణ్ రావు , రమేష్ , గ్రామ సర్పంచ్ బాడిశ మహేష్ , కాయం శేఖర్, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: