మన్యం టీవీ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లెనిన్ కాలనీ వద్ద 33 వేల రూపాయలు విలువచేసే టేకు కలపను పట్టుకోవడం జరిగింది.ఈ టేకు 0. 250 సెంటీమీటర్ల మూడు టేకు దిమ్మెలును చత్తీస్ ఘడ్ రాష్ట్రం టేకులేరు గ్రామం నుంచి కారులో చర్లకు తరలిస్తున్న క్రమంలో అడవిలో కూంబింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్, సిఆర్పిఎఫ్ పోలీసులకు కలప కంట పడడంతో పట్టుకున్నారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేసి అప్పగించడం జరిగింది. టేకు కలప, వాహనము చర్ల కు చెందిన ఒక ఫర్నిచర్ షాపు యజమానిదని సమాచారం. దీనిపై కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు.
Post A Comment: