CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండలంలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలు తనిఖీ...

Share it:

 


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: పారదర్శకత కోసమే ఎరువులు, పురుగుల మందుల దుకాణాలన్నీ తనిఖీ చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ ఏడీఏ తాతారావు అన్నారు. సోమవారం చండ్రుగొండ మండలం వ్యాప్తంగా ఎరువుల,పురుగు మందుల దుకాణాలన్నీ ఆయన తనిఖీ చేశారు. షాపుల్లో రికార్డులు, స్టాక్ కొనుగోలు, అమ్మకాలు వివరాలు , స్టాక్ బోర్డ్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తనిఖీ చేయడం జరిగిందని, ప్రతి కొనుగోలు,అమ్మకంపై కచ్చితంగా రసీదులు రైతులకు ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు డీలర్లు తప్పకుండా ప్రతి విషయాన్ని రికార్డుల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి నవీన్ బాబు, ఏ ఈ ఓ లు విజయ్, సాయి భాను, సుకన్య తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: