గుండాల సెప్టెంబర్ 2 (మన్యం మనుగడ) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగ జంగ్ సైరన్ లో భాగంగా హైదరాబాద్ బయలుదేరుతున్న పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యమా చారి అన్నారు. హైదరాబాద్ బయలుదేరే మమ్ములను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని ఖండిస్తున్నా మని ఆయన పేర్కొన్నారు. అరెస్టులతో ఉద్యమాలు ఆగవని ఆయన తెలిపారు. అరెస్టయినవారిలో ఈ సం పాపారావు, దుర్గ , రమేష్ , చలపతి, రాజేష్ , సమ్మయ్య లు ఉన్నారు
Navigation
Post A Comment: