👉మొక్కల పెంపకం ప్రతి ఒక్కరు బాధ్యత గా తీసుకోవాలి:వెంకటయ్య
👉వెంకటయ్య ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ
మన్యం టీవి, జూలూరుపాడు:
జూలూరుపాడు మండలం, పాపకొల్లు గ్రామం లో ప్రముఖ ప్రకృతి ప్రేమికులు మొక్కల వెంకటయ్య సోదరి పూరేటి ముత్తమ్మ దశదిన ఖర్మ జ్ఞాపకార్థం ఆమె సోదరుడు, ప్రకృతి ప్రియుడు మొక్కల వెంకటయ్య ఆధ్వర్యంలో షుమారు 600 మొక్కలను పంపిణీ చేశారు. పూల మొక్కలు, , పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, ఔషధ మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. పుట్టిన రోజు, పెండ్లిరోజు, పండుగలు, మొదలైన శుభాశుభ కార్యాలకు మొక్కలను పంచడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవలన్నారు. ప్రతి ఒక్కరు నడిచే మొక్క కావాలన్నారు. అప్పుడే వాతావరణ సమతుల్యత సమాంతరంగా ఉండి ప్రజలకు సుఖ శాంతులు అందుతాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన బృంద సభ్యులు లక్మి, ముస్తాఫా, చంద్రమౌళి, రాయి నగేష్, రాయి నాగార్జున, సుగుణారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: