మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం డుగినేపల్లి ప్రభుత్వ ఉన్నత పాటశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు హనుమ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కావడం జరిగింది. బుధవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. దుగినేపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు హనుమ, విధ్యాభోధనతోపాటు పాఠశాలకు సంబందించిన మౌలిక వసతులను పూర్తిచేయడంలో ముఖ్య పాత్ర పోసించాడు . ఉపాధ్యాయుడు హనుమ ఆధ్వర్యంలో "ఇoటిoటా ఇన్నోవేషన్- 2021 " కార్యక్రమంలో ఒక విధ్యార్ధి రాష్ట్ర స్థాయిలో ఎంపిక అయ్యాడు. గ్రామస్థులు, పూర్వ విధ్యార్ధుల సహాయంతో పాఠశాలలో "వాటర్ బెల్ " కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాడు . ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయుడు హనుమ చేస్తున్న కృషిని గుర్తించి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తో సత్కరించింది
Post A Comment: