పొంగులేటి శ్రీను అన్న జన్మదిన సందర్భంగా విప్ రేగా ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి. శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మణుగూరు మండలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.శ్రీను అన్న జన్మదిన వేడుకలకు హాజరైన ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు,యువజన నాయకులు,అభిమానులు,భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం చాలా అభినందనీయం అని,రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి విప్ రేగా పేరుపేరునా వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా,డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి.బ్రహ్మయ్య, మణుగూరు జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,ఎంపీపీ కారం. విజయకుమారి,జడ్పీటీసీ లు,ఎంపీపీ లు,వైస్ ఎంపీపీ కె.వి రావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, మణుగూరు మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు రాం రెడ్డి,నవీన్,పినపాక నియోజకవర్గ,టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,మండల అధ్యక్షులు,యువజన అధ్యక్షులు,మహిళ అధ్యక్షులు రమాదేవి,చంద్రకళ,మహిళ కార్యకర్తలు,యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు యంపాటి.సందీప్ రెడ్డి,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: