CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహాత్ముని మార్గాన్ని అనుసరిద్దాం - దిండిగాల

Share it:

 



భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 2 మన్యం టీవీ :- శాంతి మార్గం ద్వారా హింసను జయించి దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ చూపించిన మార్గాన్ని అనుసరిద్దామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ అన్నారు. గాంధీజీ 152 వ జయంతిని పురస్కరించుకుని స్థానిక జిల్లా గ్రంథాలయంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి, అహింస ద్వారా ఎంతటి జటిలమైన సమస్యనైనా పరిష్కరించు కోవచ్చని, అదే మార్గాన్ని ఆచరిస్తూ బ్రిటిష్ వారిని మనదేశం నుండి వెళ్లగొట్టి స్వతంత్ర భారతావానిని సంపాదించి పెట్టారని చెప్పారు. మహాత్ముడి ఆశయాల సాధనకు అంతా శ్రమించాలని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు జి. మణి మృదుల,  పి. మాధవ రావు, మునిర్, శివ తదితరుల పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: