మన్యం మీడియా/దమ్మపేట:: భద్రాచలం అభివృద్ధికి కృషి చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను, గండుగులపల్లి లోని వారి స్వగ్రామంలో భద్రాచలం కు చెందిన ప్రముఖులు అడుసుమల్లి జగదీష్, అలీ ఖాన్, మేడ మల్లికార్జున్ రావు లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి, శ్రీ సీతారామచంద్రుల ఫోటోను బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా అభివృద్ధిలో తుమ్మల వారి సేవలు అభినందనీయమని ప్రశంసించారు.
Post A Comment: