గుండాల అక్టోబర్ 22 (మన్యం మనుగడ) పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మండల నాయకులు హాజరయ్యారు. అనంతరం భాస్కర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీ విజయపథంలో దూసుకుపోవాలంటే కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలన్నారు. 2023 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు అబ్దుల్ నబి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్తీ లింగయ్య , ముత్త పురం సర్పంచ్ సమ్మయ్య , ఉప సర్పంచ్ శంకర్ , యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, జి రాంబాబు , రాము , గడ్డం రమేష్ , ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: