మన్యం టీవీ, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల పర్యటనకు విచ్చేసిన ఆర్ నారాయణ మూర్తి ని అశ్వారావుపేట మండల ఆదివాసి నాయకపోడు సేవా సంఘం మండల కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. మండల అధ్యక్షుడు సీతా రామ్ సింగ్, గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు సంఘం కృష్ణమూర్తి, కోశాధికారి గడ్డం సత్తిబాబు, కుల సంఘం నాయకులు పాల్గొని మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆదివాసి నాయకపోడు జాతి గురించి ఒక సినిమా తీయాలని కోరారు, సంస్కృతి సాంప్రదాయాలు భూ పోరాటాలు గురించి వివరించారు. గాంధారి మైసమ్మ, పెద్దమ్మ తల్లి రాజులు లక్ష్మీదేవర, చెవి నేని భీమయ్య, మద్ది రామచందర్, నాయకపోడు గూడాలు, విధి విధానాలు మీద సినిమా తీయమని కోరారు. దానికి ఆర్ నారాయణ మూర్తి సానుకూలంగా స్పందించారు. ఆల్రెడీ ఆదివాసీల మీద నాలుగు సినిమాలు తీశామని అన్నారు, మీ గురించి కూడా చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం మండల సభ్యులు ఆర్ నారాయణ మూర్తి కి కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: