తుడుందెబ్బ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ
గుండాల అక్టోబర్ 19 (మన్యం మనుగడ) ఆదివాసి ఆశాజ్యోతి కొమరం భీమ్ 81 వ వర్ధంతి అక్టోబర్ 30వ తారీఖున ఘనంగా నిర్వహిస్తామని తుడుందెబ్బ నాయకులు వజ్జ ఎర్రయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలో కొమురం భీం వర్ధంతి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం కొమరం భీమ్ వర్ధంతిని వాడవాడలా నిర్వహిస్తున్నామని ఆయన ఆయన పేర్కొన్నారు. గిరిజనుల కోసం కొమరం భీమ్ అనేక పోరాటాలను చేశారని ఆయన అన్నారు. మహనీయుని ప్రతియేటా స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పునేం శ్రీను, కుంజ కన్నయ్య , వెంకటేశ్వర్లు , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: