గుండాల/ ఆళ్ల పల్లి సెప్టెంబర్30(మన్యం మనుగడ) గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో ఉన్న పంచాయతీల అభివృద్ధిపై రెండు మండలాల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు ఆళ్లపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవోఆపీస్ లో డివిజనల్ పంచాయతీ అధికారి హరి ప్రసాద్ అవగాహన సదస్సు నిర్వహించారు. పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా వీరికి అవగాహన కల్పించారు. పంచాయతీలు ప్రగతి పథంలో నిలపాలంటే ముందస్తుగా ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల పల్లి ఎంపీడీవో మంగమ్మ , గుండాల ఎం పీ ఓ అలీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు
Post A Comment: