CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జ్వరంతో అమరారం సెక్రటరీ మృతి

Share it:

 




మన్యం టీవి,పినపాక:

పినపాక మండలం అమరారం గ్రామ పంచాయతీ సెక్రటరీ గా విధులు నిర్వహిస్తున్న గుదే వెంకటేశ్వర్లు(37) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎంపిడిఓ శ్రీనివాసులు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వెంకటేశ్వరరావు అవివాహితుడు. చేతికందిన కొడుకు మరణించడంతో తల్లి ఆదిలక్ష్మి, తండ్రి రాము కన్నీటి పర్యంతమయ్యారు. మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు ఈ విధంగా జ్వరంతో చనిపోవడం బాధాకరమని ఎంపీడీవో శ్రీనివాసులు అన్నారు. సెక్రటరీ వెంకటేశ్వర రావు మృతి పట్ల తమ సానుభూతిని తెలియజేసి పినపాక మండలం ఎంపీడీవో, కార్యాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు కలిసి 9 వేల రూపాయలు, మణుగూరు మండల పంచాయతీ సెక్రటరీలు 10వేల రూపాయలు దహన ఖర్చులకు గాను వెంకటేశ్వరరావు కుటుంబానికి అందజేయడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: