CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని

Share it:

 



 *ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా

మన్యం టీవీ మంగపేట.

 విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్థి సమాఖ్య ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగపేట మండలం రమణక్కపేట ప్రభుత్వ పాఠశాల ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు రవి డివైఎఫ్ఐ జిల్లా నాయకులు మునిగల అంజిబాబు మాట్లాడుతూ మంగపేట మండలంలోని రమణక్కపేట ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేవు స్కూల్స్ తెరవటమే కాదు విద్యార్థులకు కావాల్సిన కనీస వసతులు కల్పించే భాద్యత కూడా ప్రభుత్వానిదే. రమణక్క పేట ప్రభుత్వ పాఠశాల లో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కాంపౌండ్ వాల్ , బాత్రూములు, ఉపాధ్యాయులు కొరత వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ సమస్యలువెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు లేనియెడల ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.

  ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు ఇందారపు రమేష్, అంజి బాబు, కొమరం సందీప్ ,సాయి ,శ్రీను, నందన్, సాయి, తేజ, గణేష్ ,సత్యం తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: