మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక , కరకగూడెం మండలంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను ఏ డి ఏ అఫ్జల్ బేగం తనిఖీ చేశారు. దుకాణాలలో ని పురుగు మందుల నిల్వల గురించి ఆరా తీశారు. ప్రతి దుకాణంలోని పురుగు మందులకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. మండలంలోని ఓ దుకాణం లో ఒక పురుగు ముందు కు సంబంధించిన న్యాయస్థాన పత్రాలు సరిగా లేనందున ఆ పురుగు మందులకు సంబంధించిన అమ్మకాలు నిలిపివేయాలని ఏ డి ఏ అఫ్జల్ బేగం చెప్పారని, పినపాక మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తెలియజేశారు. అమ్మిన ప్రతి ఎరువు, పురుగుమందు కు సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని, ఏ రోజుకు ఆ రోజు సమాచారాన్ని మండల వ్యవసాయ అధికారికి తెలియజేయాలని వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పినపాక మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, కరకగూడెం మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్, ఎరువుల దుకాణాలు డీలర్లు తదితరులు పాల్గొనడం జరిగింది
Post A Comment: