CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చిరుధాన్యాలతో ఎన్నో ప్రయోజనాలు ;ఆళ్లపల్లి ఎంపీపీ మంజుభార్గవి ; సి డి పి ఓ రామ తార

Share it:


 గుండాల ఆళ్లపల్లి అక్టోబర్ 27 (మన్యం మనుగడ) చిరుధాన్యాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆళ్ల పల్లి ఎంపీపీ కొండ్రు  మంజు భార్గవి, టేకులపల్లి ఐ సి డి ఎస్ సి డి పి ఓ రామ తార అన్నారు. బుధవారం   మండలం పరిధిలోని రాయపాడు గ్రామంలో గల ఐ సి డి ఎస్  కేంద్రంలో చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాగులు, కొర్రలు, జొన్నలు, తదితర చిరుధాన్యాలతో వంటకాలు చేసుకొని తినడం వలన రోగాలు దరిచేరవని వారు అన్నారు. వీటిని రైతులు పండించేదుకు ముందుకు రావాలని వారు కోరారు. చిరుధాన్యాల తో వండిన వంటకాలు తినడం వలన ఐరన్, రక్తహీనత, క్యాల్షియం పుష్కలంగా దొరుకుతాయి అన్నారు. ప్రతి ఒక్కరు వీటిని తీసుకునే విధంగా చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ సి డి పి ఓ అరుణ కుమారి, సర్పంచ్ ఈశ్వరి, సూపర్వైజర్ అనురాధ, సక్కుబాయి, సుమతి, అంగన్వాడి టీచర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: