విశాఖ జిల్లా పాడేరు స్పైసెస్ బోర్డు కార్యాలయ సందర్శన
మిరియాల పంట క్షేత్ర పరిశీలన
మన్యం టీవీ మంగపేట.
నేడు (బుధవారం) జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి వికాస్ అగ్రి ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ఆంధ్రా పర్యటనకు వెళ్లనున్నారు ఈ సందర్భంగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం గిరిజన ప్రాంతమైన విశాఖ జిల్లా పాడేరు, లంబసింగి, చింతపల్లి పర్వత శ్రేణి ప్రాంతంలో సేంద్రియ పద్ధతుల్లో సుగంధ పంటగా మిరియాలు మరియూ పసుపు అక్కడ గిరిజన రైతాంగం సాగు చేస్తోందని మిరియాలు పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మరియు పంట సాగుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు స్పైసెస్ బోర్డ్ ద్వారా అందిస్తున్న రాయితీ పథకాల గురించి తెలుసుకో బోతున్నట్లు ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో విలీన మండలాల్లో సాగవుతున్న మిర్చి తోటలను పరిశీలించే అవకాశం ఉందని తెలిపారు తన పర్యటనలో వికాస్ ఆగ్రి ఫౌండేషన్ ప్రతినిధులు పాడేరు మిరియాల రైతులు యఫ్పివో లు స్పైసెస్ బోర్డ్ సిబ్బంది పాల్గొననున్నట్లు వివరించారు.
Post A Comment: