మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నూతన కమిటీలలో అశ్వారావుపేట మండల టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా తిరుమలకుంట గ్రామానికి చెందిన జుజ్జురి మనోహర్ నియమితులయ్యారు. ఈ సందర్బంగా జుజ్జురి మనోహర్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగించడం చాలా ఆనందంగా ఉంది అని, పార్టీకి విశేష సేవలు, కార్యక్రమాల విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ పార్టీలో మంచి గుర్తింపు వచ్చేలా చేస్తానని, తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని స్పష్టం చేశారు. తనను నియమించిన మెచ్చా నాగేశ్వరావు, జూపల్లి రమేష్, బండి పుల్లారావు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి మరియు సహకరించిన పార్టీ నాయకులకు జుజ్జురి మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: