CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఊరట్టానికే చైర్మెన్ గిరి లేదంటే కిరికిరె

Share it:



  • ఊరట్టానికే చైర్మెన్ గిరి లేదంటే కిరికిరె  
  • తీర్మానించిన ఊరట్టం గ్రామసభ. 
  • రెండో పంట నష్టం పరిహరం 2008 నుంచి చెల్లించాలి. *పేసా చట్టం ప్రకారంగా షేడ్యూల్డు ఏరియా.
  • మేడారం సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఊరట్టం గ్రామ పంచాయితికే ఇవ్వాలి అని గ్రామ సభ తీర్మానం.
  • 5 తరాల నుంచి ఊరట్టానికి ప్రగతి లేదు.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ఫిబ్రవరి లో జరిగే ప్రసిద్ధి మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి  ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామ పంచాయతీకే ఇవ్వాలి అని పేసా గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు.బుధవారం ఊరట్టం గ్రామ పంచాయతీ ఆవరణలో  ఊరట్టం సర్పంచ్ శ్రీధర్  అధ్యక్షతన పేసా జిల్లా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఊరట్టం, కన్నెపల్లి,కొత్తూరు ప్రజలు సమావేశమై సమస్య లు గురించి చర్చించుకున్నారు. జాతర జరిగే ప్రదేశం అయినా మా గ్రామ పంచాయతీని ఏ చైర్మన్ కూడా ఇంత వరకు పట్టించుకోలేదని ఇప్పటికి అయినా మాకు ప్రాతినిధ్యం కల్పించాలి అని,పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి అని,మేడారం జాతర సమయం లో రెండో పంట వేయకుండా ప్రభుత్వం ఆపి నష్ట పరిహారం ఇవ్వడం లేదని 2008 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఉన్న కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి అని,సాగులో ఉన్న రైతులకు పట్టాదారు పాసుబుక్ లు ఇవ్వాలి అని, ఊరట్టం నుండి కల్వపల్లి గ్రామం వరకు 4 కిలోమీటర్లు బీట్ రోడ్డు వేయాలి అని,గ్రామం లో మొత్తం సిమెంట్ రోడ్డు వేయాలి అని మొదలగు తీర్మానాలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో  చేర్ప రవీందర్, కాక సారయ్య, చేర్ప వీరమోహన్ రావు,చేర్ప చంద్రశేఖర్ రావు,ఉప సర్పంచ్ సమ్మక్క వార్డ్ మెంబర్లు, యువజన సంఘాలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: