గుండాల అక్టోబర్ 1 (మన్యం మనుగడ) ఏకలవ్య మోడల్ పాఠశాల లో సీటు కొరకు అర్హత కలిగిన గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని మామ కన్ను ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యా రాణి ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల ఐదో తారీఖు లోపు దరఖాస్తులను పాఠశాలలో అందజేయాలని కోరారు. ఎస్టీ బాలికకు 7, బాలురులకు 2, నాయక్ పోడ్ బాలికకు 1, చొప్పున సీట్లు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల నీటిని భద్రాచలం ఐటిడిఎ పిఓ గౌతమ్ సమక్షములో పద్ధతి ద్వారా ఎంపిక చేయబడుతుంది అని ఆమె పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు
Post A Comment: