మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, కోయ రంగాపురం గ్రామ పంచాయతీకి చెందిన వార్డ్ మెంబర్ మడివి నారాయణ (45) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వివరాల్లోకి వెళితే ఆసుపాక గ్రామ శివారు నందిపాడు దగ్గర ఏపీకి చెందిన జంగారెడ్డిగూడెం డిపో ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మరణించినట్లు నిర్ధారణ అయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు.
Post A Comment: