మన్యం టీవి, అశ్వాపురం:
హైద్రాబాద్ లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ని అశ్వాపురం టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమారేందర్, వైస్ ఎంపీపీ కంచు గంట్ల వీరభద్రం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు కి తనపై నమ్మకంతో మరోమారు అశ్వాపురం మండల అధ్యక్షునిగా ఎంపిక చేయడం పట్ల కోడి అమరేందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేగా ను కలిసిన వారిలో అశ్వాపురం మండల టీఆరెస్ నాయకులు చిలక వెంకట్రామయ్య ,యువజన నాయకులు ,లంకెల రమేష్ ,కోరేం రామారావు ,పున్నారావు ,హుస్సేన్ ,సోయం శ్రీను తదితరులు ఉన్నారు.
Post A Comment: