మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఇల్లందు మండల పరిధిలోని కొత్తగూడెం రోడ్డులోని ముస్లిం అనాధఆశ్రమం మదర్స్ లో కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లంబాడీల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీర శివ నాయక్ మాట్లాడుతూ. . ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో టేకులపల్లి, కామేపల్లి, ఇల్లందు మండలాల్లో నిర్వహించడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాల దళిత గిరిజన జాతి అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని ఎవరు అయిన పేద ఇంట బిడ్డ కూడా కష్టాల్లో ఉంటే నేనున్నానని ఆదుకున్న ఆపద్బాంధవుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ నాయక్, రాజ్ కుమార్ నాయక్, వినోద్ నాయక్, ప్రేమ్ నాయక్, వెంకట్, నవీన్ ముస్లిం మదర్స్ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: