భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నల్లబాడు గ్రామంలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం మండల కమిటీ కోశాధికారి గడ్డం సతీష్ బాబు ఆధ్వర్యంలో నల్లబాడు గ్రామంలో ఆదివాసి నాయకపోడు సేవా సంఘం గ్రామకమిటీ సమావేశం నిర్వహించి నూతన గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి నాయకపోడు సేవా సంఘం మండల అధ్యక్షులు, కార్యదర్శి, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ఆదివాసీ నాయకపోడులు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో ముందుకు రాణించాలని సూచించారు. కొమరం భీం వర్ధంతి నాడు ఆయన్ని స్మరించుకుంటూ మొదటి గ్రామ కమిటీ నిర్వహించుకోవడం శుభసూచకమని కొమురం భీం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేస్తూ నాయకపోడు అభివృద్ధికి పాటుపడాలని వారు అన్నారు. మండల కమిటీ నిర్వహణ తరువాత మొదటి గ్రామ కమిటీ ఎన్నిక నల్లపాడు గ్రామం లో జరిగిందని, మిగతా గ్రామాల్లో కూడా గ్రామ కమిటీ ఎన్నికల నిర్వహణ త్వరితగతిన పూర్తి చేస్తామని వారు అన్నారు. ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం నల్లబాడు గ్రామ కమిటీ అధ్యక్షులుగా గెడ్డం వెంకట స్వామినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా గడ్డం లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శిగా దానపు కొర్రాజులు, కోశాధికారిగా గెడ్డం పుల్లారావు, ప్రచార కార్యదర్శిగా తాళ్ల వెంకటేశ్వరావు మరియు మరొక 20 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నారం సీతా రామ్ సింగ్, ప్రధాన కార్యదర్శి దాది చంటి, ఉపాధ్యక్షులు సంఘం కృష్ణమూర్తి మరియు గ్రామ పెద్దలు పోతురాజు, నాగులు, గెడ్డం పుల్లారావు మరియు యువకులు గెడ్డం నాగేంద్ర, రవి, గోపి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: