మన్యం టీవి, భద్రాచలం:
భద్రాచల వాసి విశ్రాంత ఉద్యాన శాఖ అధికారి మరియు గ్రీన్ భద్రాద్రి గౌరవ అధ్యక్షులు అయిన గోళ్ళ భూపతి రావు గత పది సంవత్సరాలుగా పర్యావరణం లో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, లయన్స్ క్లబ్ సేవలు, వివిధ సంస్ధల కు చేయూత, కోవిడ్ తీవ్ర రూపం దాల్చిన సమయంలో బాధితులకు సహాయం, park ల ఏర్పాటు మరియు ఉద్యాన రైతులకు సలహాలు సూచనలు గాను ఎన్నో పురస్కారాలు, ఆ ప్రయాణంలోనే గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ అమెరికా కేంద్రంగా పనిచేస్తూ దాని అనుబంధంగా చెన్నై నగరంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వివిద రంగాలలో విశేష ప్రతిభ కనబర్చిన ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నారు. ఈ సంవత్సరం పర్యావరణం లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న శ్రీ గోళ్ళ భూపతి రావు కు "" గౌరవ డాక్టరేట్ "' పురస్కారానికి యూనివర్సిటీ సెనేట్ ఎంపిక చేయడం జరిగింది. ఈ రోజు పాండిచ్చేరి నగరంలోని షేన్ భాగ్ కన్వెన్షన్ హాల్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ''గౌరవ డాక్టరేట్ "" పురస్కారాన్ని గోళ్ళ భూపతిరావుకు యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చైర్మెన్ డాక్టర్ పి. మేన్యూల్, గౌరవ అతిథి రిటైర్ జడ్జి శ్రీ మురుగన్ భూపతి, రిటైర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సంపత్ కుమార్ , రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ షణ్ముగ సుందరం, డాక్టర్ సి ఆర్ భాస్కరన్ చెన్నై, డాక్టర్ ఆర్ దానపల్లి న్యూడిల్లీ వారి నుండి స్వీకరించిడం జరిగింది. ఈ సందర్భంగా గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ ఈ పురస్కారం ద్వారా నామీద మరింత బాధ్యత పెరిగిందని పర్యావరణ పరిరక్షణకు యింకా చురుగ్గా పాల్గొంటానని అదేవిధంగా నా ఈ ప్రయాణంలో నాతో పయనిస్తూన్న మిత్రులు శ్రీ ఏగి సూర్య నారాయణ, శ్రీ రంగా రావు, శ్రీ శంకర్ రావు, శ్రీ రాజిరెడ్డి, శ్రీ వై వి గణేష్, శ్రీ దేశప్ప, శ్రీ నివాస్ రెడ్డి, శ్రీ తిరుమల రావు, కామిశెట్టి కృష్ణార్జున రావు, నాగరాజు , శ్రీ మతి శ్రీ దేవీ మరియు యితర మిత్రులకు శ్రేయోభిలాషులకు అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
Post A Comment: