మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన జడ పోలు కిషోర్(58) శనివారం ద్విచక్ర వాహనంపై కారేపల్లి నుండి వస్తున్నారు. ఈ క్రమంలో కారేపల్లి నుంచి వెళ్తున్న బొలెరో మాక్స్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై సురేష్ వివరాలు నమోదు చేసుకున్నారు. వాహనాన్ని డ్రైవర్ అక్కడే వదిలి పారిపోయారు.
Post A Comment: