మన్యంటీవి, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, రాచురుపల్లి గ్రామంలో దేవి నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా, ఆదివాసి యూత్ ఆధ్వర్యంలో, గ్రామస్థాయి వాలీబాల్ ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి, హాజరై జెండా ఆవిష్కరించి, క్రీడా పోటీలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మరియు అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ. మూడు రోజులు జరిగే ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభ అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని వాలీబాల్ పోటీలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకత ఉమామహేశ్వర రావు, సర్పంచ్ తోట రాజు, ఎంపీటీసీ నాయుడు శ్రీను, ఎస్సీ సెల్ అధ్యక్షులు రావూరి వీరయ్య, టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి తిరువేదుల జేమ్స్, తాటి సూరిబాబు, నలుపు నాగేంద్ర, సోయం రాముడు, సోయం శ్రీను మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: