మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఎంపీటీసీ కాయం శేఖర్ మాట్లాడుతూ, భరత జాతి గర్వించదగ్గ, బ్రిటిష్ పాలకులను శాంతి సహనం అనే మంత్రాలతో గడగడలాడించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మల్లారం సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: