CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వేదాంతపురం గ్రామంలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం గ్రామ కమిటీ సమావేశం

Share it:

 


 మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామంలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం గ్రామ కమిటీ గురువారం సాయంత్రం నిర్వహించుకోవడం జరిగింది. ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం మండల రైతు విభాగ అధ్యక్షులు గెడ్డం వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల అధ్యక్ష, కార్యదర్శి, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ వేదాంతపురం ఆదివాసి యువకులకు, పెద్దలకు చదువు పై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సూచించారు. చదువు మధ్యలో ఆపేసిన పిల్లలను మళ్ళీ చదివించాలని సూచనలు ఇచ్చారు. నాయకపోడ్లుకు ఏమైనా సమస్యలు వస్తే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కూడా సంఘం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డ గిరిజన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించడం జరిగింది. నాయకపోడు సేవా సంఘం వేదాంతపురం గ్రామ కమిటీ సభ్యులుగా అధ్యక్షులు రావుల వీర రాఘవులు, ప్రధాన కార్యదర్శి తోట శివనాగరాజు, కోశాధికారి దాది సింగరాజు, ఉపాధ్యక్షులు గెడ్డం చిన్న రాఘవులు, ప్రచార కార్యదర్శి దాది ముత్తు, మహిళా అధ్యక్షురాలు సిద్దిన గోపమ్మ లను ఏకగ్రీవంగా నియమించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సభ్యులు అధ్యక్షులు నారం సీతా రామ్ సింగ్, ప్రధాన కార్యదర్శి దాది చంటి, ఉపాధ్యక్షులు సంఘం కృష్ణమూర్తి మరియు గ్రామ సర్పంచ్ సోమిని శివప్రసాద్ యువకులు దాది సోమరాజు, తోట వెంకట సాయి, రాధా, రామకృష్ణ, పోతురాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: