మన్యంటీవి, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో ఆదివాసి నాయకపోడు సేవా సంఘం జిల్లా కోశాధికారి పాశం వెంకటేశ్వరావు మరియు దమ్మపేట మండలం ప్రధాన కార్యదర్శి బత్తుల సాయి అద్వర్యంలో మన్యం వీరుడు, పోరాటయోధుడు నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించిన కొమరం భీమ్ యొక్క 81 వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు జల్ జంగల్ జమీల్ అనే నినాదంతో అందరూ ముందుకు వెళ్లాలనీ గిరిజన చట్టాలను ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ అందరూ చైతన్యవంతంగా పోరాడే ఐక్యతను చాటాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు అనేక మంది పాల్గొన్నారు.
Post A Comment: