మన్యం టీవీ ఏటూరు నాగారం
పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు ములుగు ఎమ్మెల్యే సీతక్క ను అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన
మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని నిరుద్యోగులు చెప్పు కోవడానికి వచ్చిన
తెలంగాణ నిరుద్యోగ జంగు సైరన్ కార్యక్రమానికి బయలుదేరిన విద్యార్థి నిరుద్యోగుల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై నిన్న ఎల్బీనగర్ లో తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంత్ చారి సాక్షిగా జరిగిన లాఠీచార్జి పై పి సి సి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై అలాగే ములుగు ఎమ్మెల్యే సీతక్క ను అరెస్ట్ కు నిరసనగా ములుగు జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి ఆదేశాల మేరకు ఆదివారం ఏటూరు నాగారం మండలం లోని చిన్నబోయినపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ విద్యార్థి లోకం తలుచుకుంటే ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు తలకిందులైన సందర్భాలు చూశామని అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగ విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ సైనికులు తలుచుకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ను బొంద పెడతారని టిఆర్ఎస్ ప్రభుత్వం ను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వసంత శ్రీనివాస్ యాదవ్,ఎస్ టీ సెల్ మండల అధ్యక్షులు చేల వినయ్ కుమార్,యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల నవీన్,యూత్ కార్యదర్శి సర్దార్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: