చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: పంచాయతీ పరిధిలో ఏ నిధులు వచ్చిన తన ఇష్టానుసారంగా వార్డు సభ్యులకు తెలియపరచ కుండా తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దీనిపై వార్డు సభ్యులు అడగగా సర్పంచ్ పొంతన లేని సమాధానం చెబుతున్నారు. పంచాయితీలో బెండాలపాడు గ్రామానికి మరొక పార్కు మంజూరు కాగా సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు కార్యదర్శి వార్డు సభ్యులకు తెలియకుండా పక్క ఊరు అయినా బాలికుంట గ్రామానికి పార్కు ఉన్న మళ్లీ అక్కడే పార్కు నిర్ణయించినారు. దీనిపై బెండాలపాడు గ్రామపంచాయతీ సర్పంచ్,ఉప సర్పంచ్ మరియు కార్యదర్శి గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని, ఎంపీడీవో గారికి వినతి పత్రం అందజేశారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, ట్రైకార్ లబ్ధిదారు విషయంలో ఏకపక్షం, నిర్ణయం తీసుకున్నారని పిసా కమిటీ ఉపాధ్యక్షుడు తెలియకుండా సొంత నిర్ణయం తీసుకుంటారని దీనిపై విచారణ చేపట్టాలని ఎంపీడీవో గారికి పీసా ఉపాధ్యక్షుడుకి వర్షా వీరభద్రం ఫిర్యాదు చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ గారికి, ఐటీడీఏ పీవో గారికి తెలియజేస్తామని వార్డు సభ్యులు తెలియజేశారు.
Post A Comment: