మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం జానంపేట కు చెందిన శ్రీ సాయి దుర్గ ఎరువుల దుకాణం యజమాని కన్నెగంటి దుర్గాప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎరువులు, పురుగు మందులు,విత్తనాల డీలర్ల సంఘనికి కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గతంలో దుర్గాప్రసాద్ సొసైటీ కార్యాలయంలో సెక్రటరీగా పనిచేశారు. జిల్లా పురుగు మందులు, ఎరువుల,విత్తనాల డీలర్ల సంఘానికి జిల్లా కార్యదర్శి గా ఎన్నిక కావడంతో పలువురు మండలం లోని రైతులతోపాటు పురుగు మందుల దుకాణం యజమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.అదేవిధంగా జిల్లా పురుగు మందులు, ఎరువుల,విత్తనాల డీలర్ల సంఘానికి అధ్యక్షుడు గా నల్లి సోమసుందర్ ఎన్నిక అయ్యారు.
Post A Comment: