మన్యం టీవీ మంగపేట.
బిజెపి పార్టీ దళిత మోర్చా జిల్లా కమిటీ పిలుపుమేరకు మంగపేట మండలం లో బోయకులానికి చెందిన బహుజనుల మహాకవి వాల్మీకిగా రూపు దాల్చిన అద్భుతమైన రామాయణ మహాకావ్యాన్ని కడురమనీయంగా లిఖించి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వాల్మీకి జయంతి వేడుకలు బిజెపి పార్టీ దళిత మోర్చా మండల అధ్యక్షులు దుర్గం నరసింహారావు ఆధ్వర్యంలో వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి పార్టీ దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జాడి రాంబాబు హాజరై మాట్లాడుతూ బహుజన జాతి ఏకం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మంగపేట మండల అధ్యక్షులు ఎర్రంగాని వీరణ్ కుమార్ మండల ఉపాధ్యక్షులు అబేరబోయిన లక్ష్మణ్ బిజెపి పార్టీ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు దంతనపెళ్లి నరేందర్ గిరిజన మోర్చా మండల నాయకులు భూక్య రతన్ సింగ్ దళిత మోర్చా మండల ఉపాధ్యక్షులు కావేరి నారాయణ దళిత మోర్చా మండలం కార్యదర్శి దుర్గం రాంబాబు,బిజెపి నాయకులు గుండు చందు, చల్లూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: