మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణం లోని గాంధీనగర్,ఆదర్శనగర్,శేషగిరి నగర్,లెనిన్ నగర్, గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,స్థానిక ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశంను పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు అధ్యక్షత న శనివారం విస్తృతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ స్దాపించి 20 సంవత్సరాలు పుర్తి అవుతున్న సందర్భంగా,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చారన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పని చేయాలని, అలాగే 27 వ తేదిన నియోజకవర్గ స్థాయి సమావేశం,నవంబర్ 15వ తేదిన వరంగల్లో జరిగే విజయ గర్జన సభలను పార్టీ నాయకులు,కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు.కార్యకర్తల సమీకరణ గ్రామ కమిటీ అధ్యక్షులు భాధ్యత తీసుకొని పని చేయాలన్నారు.స్దానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి అన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు.వరంగల్లో జరిగే విజయ గర్జన సభకు ప్రతి గ్రామం నుండి ఒక బస్సు ఉంటుందని,కార్యకర్తలు అందరూ హజరుకావాలన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, నాయకులు ఎడ్ల శ్రీను,హరి ప్రసాద్,హరి గోపాల్,సూర సుధాకర్,తుపూడి శ్రీను, వేముల లక్ష్మయ్య, సంజీవరావు,చంద్రకళ,విజయశ్రీ,అప్పయ్య,సంజీవరావు,ఇజ్రాయిల్,రఘు,అప్పారావు,తాత రమణ,స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: