తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు
మన్యం మనుగడ, పినపాక:
సీఎం కేసీఆర్ గారి ఆదేశానుసారం వృద్ధాప్య పెన్షన్ల వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల తగ్గించారు. ఈ నియమ నిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా దరఖాస్తులు చేసుకొనే వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఆగస్టు 31 నాటికి కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ, అర్హులైన అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో నేటి నుండి 30 తేదీ వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
దరఖాస్తుకు ఓటర్ కార్డు, తదితర పత్రాలను జత చేయాలన్నారు,ఈ.సేవ, మీ సేవలో, ఎటువంటి సేవల రుసుములు తీసుకోవద్దని సంబంధిత రుసుమును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారు వెల్లడించారు.
ఆసరా పెన్షన్లలో భాగంగా కనీస వయస్సును 57 ఏండ్లకు తగ్గించిన మేరకు లబ్ధిదారుల ఎంపికలో పాటించాల్సిన ప్రమాణాలను ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొందని ఆయన చెప్పారు. అర్హులైన వారు నేటి నుండి 30 లోగా ఈ-సేవ, మీ-సేవ ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలన్నారు.అందరికీ న్యాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ గారి లక్ష్యమని, అందుకనుగుణంగానే అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ఆసరా పెన్షన్లు కూడా దానిలో భాగమేనని ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో వృద్దులకు రూ. 2016/-, దివ్యాంగులకు రూ. 3016/- పెన్షన్ను కేసీఆర్ గారు అందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారు పేర్కొన్నారు...
Post A Comment: