-విజేతలకు బహుమతులు ప్రదానం
బుర్థారం జంగుబాయి యూత్ ఆధ్వర్యంలో దసర పండుగ పురస్కరించుకొని రెండు మండలాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.
వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ ప్రవీణ్ మాట్లాడుతూ...క్రీడలు క్రీడాకారులు అడడం ద్వారా మనసు ఉల్లాసంగా ఉండటమే కాకుండా,ఆరోగ్యపరంగా సంతోషంగా ఉంటారని అన్నారు.
యువత గంజాయి,మత్తుపానీయాలు పదార్థాలకు దూరంగా ఉండి,అనుకున్న లక్ష్యాలను సాధించాలని తెలిపారు.
వాలీబాల్ టోర్నమెంట్ విజేతలు మొదటి,ద్వితీయ,తృతీయ బహుమతులు గెలుచుకున్న ఎక్కెల,వెంకటాపురం,గొల్లగూడెం జట్లకు ఎస్ఐ ప్రవీణ్ ప్రధానం చేసి,అందరిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక-సత్యనారయణ,సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి,వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొమరం వెంకట నారాయణ,పోలెబోయిన అనిల్ కుమార్,పోలెబోయిన క్రిష్ణయ్య,మైపతి రాజేశ్వర్ రావ్,పోలెబోయిన పాపారావు,సర్శేష్,గ్రామస్థులు యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: