మన్యం టీవి, సుజాత నగర్:
పాల్వంచ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నందు బొజ్జల గూడెం గ్రామ పంచాయతీ నందు పోషణ మాసంలో భాగంగా సిడిపివో కనకదుర్గ , సర్పంచ్ జోగ భట్టయ్యా, సూపర్ వైజర్ వసంత రాణీ గారి అధ్యక్షతన గర్భిణి స్త్రీలకు సామూహిక సిమంతాలు నిర్వహించడం జరిగింది .గర్భిణీ స్త్రీలు, బాలింతలు తీసుకోవలసిన పోషకాహారం, జాగ్రత్త ల గురించి అవగాహన కల్పించడం జరిగింది .మరియు 18 సంవత్సరాల బాలల రక్షణ కోసం గ్రామ బాలల పరిరక్షణ కమిటీ నీ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఐసిపిఎస్ స్టాఫ్ లత, చైల్డ్ లైన్ 1098 టీమ్ మెంబర్ లలిత, అంగన్వాడీ కార్యకర్తలు, అయాలు, గ్రామస్థులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
Post A Comment: