గుండాల ఆళ్లపల్లి అక్టోబర్ 2 (మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అక్టోబర్ రెండో తారీఖున గాంధీజీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామని ఎంపీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంగమ్మ, వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య , సర్పంచ్ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: