మన్యం టీవీ వాజేడు.
ప్యూర్ స్వచ్ఛంద సంస్థ లక్ష్య సాధనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతమైన మారుమూల గ్రామం కృష్ణాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కాడేకల్ ఎంపీపీయస్ స్కూల్ లో (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఏడ్యుకేషన్ ) స్వచ్చంద సంస్థ . స్కూల్ పిల్లలకు బాగ్స్,నోటుబుక్స్, పెన్నులు, పెన్సిల్,శానిటైజెర్,మాస్క్, వాటర్ బాటిల్స్,షులు, పలకలు, పర్సులు,అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పునెం నాగచంద్ర మాట్లాడుతూ మారుమూల ప్రాంతం అయిన మా గ్రామాన్ని ఎన్నుకొని పేద పిల్లలకు ప్యూర్ స్వచ్ఛంద సంస్థ వారు చేస్తున్న సేవలను హర్షించదగినవి,అని అభినందించారు,ఈ విధంగా పేద పిల్లలకు విద్యాపరంగా అభివృద్ధి చేయాలని ఆదివాసి విద్యార్థులను విద్యలో అభివృద్ధి చేయాలనే ఈ సంస్థ వారికి సహాయ సహకారాన్ని అందిస్తాను అని అన్నారు .ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,కొట్టం భవాని పంచాయతీ కార్యదర్శి ఇరప ప్రసాద్,యం.పి.టి.సి చిట్టిబాబు, సంస్థ నిర్వాహకులు బాలు,స్కూల్ హెచ్ యం సుమన్ ,పునెం అషోపతి,రామచంద్రమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: