మన్యం టీవీ, అశ్వరావుపేట:* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు అశ్వరావుపేట నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బుధవారం నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు మండల అధ్యక్ష, కార్యదర్శులు పార్టీ పెద్దలు ముఖ్యనాయకులు హాజరుకావాలని కోరుకున్నారు.
Navigation
Post A Comment: